కీలకమైన విద్యాశాఖ భేటీకి పల్లంరాజు గైర్హాజరు

10 Oct, 2013 20:21 IST|Sakshi
కీలకమైన విద్యాశాఖ భేటీకి పల్లంరాజు గైర్హాజరు

మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎం.ఎం.పల్లంరాజు గురువారం నాడు విద్యాశాఖకు సంబంధించి ఢిల్లీలో జరిగిన కీలకమైన సమావేశానికి హాజరు కాలేదు. విద్యాహక్కు, మధ్యాహ్నభోజనం లాంటి కీలకాంశాల గురించి నిర్ణయం తీసుకోడానికి ఈ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.

ఇప్పటికే ప్రధానమంత్రికి తన రాజీనామా లేఖను సమర్పించిన పల్లంరాజు, సెంట్రల్ ఎడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (కేబ్) సమావేశానికి హాజరుకాలేదు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, వివిధ వర్సిటీల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. పల్లంరాజు హాజరు కాకపోవడంతో, ఆ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద దీనికి అధ్యక్షత వహించారు.

మరిన్ని వార్తలు