పట్టాలు తప్పిన ప్యాసింజర్

3 Sep, 2015 13:07 IST|Sakshi

జైపూర్: రాజస్థాన్లో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. జైపూర్ జంక్షన్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. చెన్నై నుంచి జైపూర్ మధ్య నడిచే రైలు సరిగ్గా జైపూర్ ప్లాట్ ఫాం వద్దకు చేరుకునే సమయంలో రైలు ఇంజిన్ పట్టాలు తప్పిపోయింది.

దీంతో దాదాపు అర్థగంటపాటు రైల్వే సిబ్బంది కష్టపడి తిరిగి ఇంజిన్ను పట్టాలెక్కించారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఇంజిన్కు చెందిన రెండు చక్రాలు పట్టాలు తప్పడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు