ఫోన్ ట్యాపింగ్పై మరో రిట్ పిటిషన్

7 Aug, 2015 14:25 IST|Sakshi

హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్పై తెలంగాణ రాష్ట్ర హోంశాఖ శుక్రవారం మరో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దాఖలైన క్రిమినల్ కేసులో ఈ రిట్ పిటిషన్ను దాఖలు చేయగా, ఈ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ను తెలంగాణ ప్రభుత్వ ట్యాప్ చేసిందని ఆరోపిస్తూ సత్యనారాయణపురం పీఎస్లో కేసు దాఖలైన విషయం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు