రైల్వేలను ప్రైవేటీకరించం: మోదీ

25 Dec, 2014 16:19 IST|Sakshi
రైల్వేలను ప్రైవేటీకరించం: మోదీ

వారణాసి: రైల్వేలను ప్రైవేటీకరించబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సుపరిపాలన దినోత్సవంలో భాగంగా గురువారం ఆయన తన నియోజకవర్గం వారణాసిల పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైల్వేల అభివృద్ధితో దేశమూ అభివృద్ధి చెందుతుందని అన్నారు. లక్షల మందికి రైల్వే ఉద్యోగాలు కల్పిస్తోందన్నారు.

దేశంలో 4 రైల్వే యూనివర్సిటీలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. భారతీయ రైల్వేలో 60 ఏళ్లుగా ఎలాంటి పురోగతి లేదన్నారు. కొద్దికాలంలోనే రైల్వేలను అభివృద్ధి చేస్తామన్నారు. 'మేకిన్ ఇండియా' దిశగా యువతను ప్రోత్సహిస్తామని మోదీ అన్నారు.
 

>
మరిన్ని వార్తలు