బౌద్ధలయాన్ని సందర్శించిన మోడీ

31 Aug, 2014 08:44 IST|Sakshi
బౌద్ధలయాన్ని సందర్శించిన మోడీ

క్యోటో: జపాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండో రోజు టోజీలోని పురాతన పగోడా బౌద్ధలయాన్ని సందర్శించారు. జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి ఆలయానికి వచ్చిన మోడీ ఇక్కడ అరగంటపాటు గడిపారు. చెక్కతో ఐదు అంతస్తుల్లో నిర్మించిన ఈ ఆలయాన్ని ఆసక్తిగా తిలకించారు.

ఎనిమిదో శతాబ్దానికి చెందిన పగోడా బౌద్ధలయ విశేషాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రధాన బౌద్ధభిక్షువు మోరీ.. ఆలయ విశేషాలను మోడీకి వివరించారు. భారత ప్రధాని తమ ఆలయాన్ని సందర్శిచడం సంతోషంగా ఉందని ఇక్కడి బౌద్ధులు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు