ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ

3 Jan, 2016 20:26 IST|Sakshi
ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ

న్యూఢిల్లీ: జాతీయ భద్రత సంస్థ(ఎన్ఎస్ఏ) ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో ఉగ్రవాదుల దాడిపై ఈ సమావేశంలో చర్చించారు. కర్ణాటక నుంచి ఢిల్లీకి తిరిగివచ్చిన వెంటనే ప్రధాని ఈ సమావేశం నిర్వహించారు.

హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. మరోవైపు పఠాన్ కోట్ లో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఆరుగురు తీవ్రవాదులను కాల్చిచంపినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు