పోకర్ణ ఉత్పత్తులకు ‘గ్రీన్‌గార్డ్’ ధ్రువీకరణ

25 Feb, 2015 01:14 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పోకర్ణ అనుబంధ కంపెనీ పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ (పీఈఎస్‌ఎల్) తయారు చేసే క్వార్ట్జ్ సర్ఫేసెస్‌కు గ్రీన్‌గార్డ్, గ్రీన్‌గార్డ్ గోల్డ్ ధ్రువీకరణ లభించింది. భారత్‌లో  క్వార్ట్జ్ సర్ఫేసెస్ తయారీ రంగంలో ఈ గుర్తింపు లభించిన తొలి కంపెనీ పీఈఎస్‌ఎల్ కావడం విశేషమని పోకర్ణ సీఎండీ గౌతమ్‌చంద్ జైన్ తెలి పారు. పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులకు కఠిన పరీక్షల అనంతరం అండర్‌రైటర్స్ ల్యాబొరేటరీస్ ఎన్విరాన్‌మెంట్ ఈ ధ్రువీకరణ ఇస్తుంది.

>
మరిన్ని వార్తలు