బెంగళూరు : కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. బైకు దొంగలను పట్టుకోవడానికి వెళ్లిన ఓ పోలీస్ అధికారిని దుండగులు దారుణంగా నరికి చంపారు. వివరాలలోకి వెళ్తే.. రాజధాని బెంగళూరుకి సమీపంలోని దొడ్డబళ్లాపురం ప్రాంతంలో ఇటీవల బైకు దొంగతనాలు పెరిగిపోయాయి. బైకు దొంగలపై నిఘా ఉంచిన పోలీసులు పట్టుకోవడానికి వెళ్లగా దొంగలు ఎదురుదాడి చేశారు. ఓ ఎస్ఐని దారుణంగా నరికి చంపి, ఆయన సర్వీస్ రివాల్వర్ను తీసుకొని పరారయ్యారు.