న్యూఢిల్లీ: పనిమనిషిని తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఢిల్లీ పోలీస్ ఏఎస్ఐ జగ్వీర్ సింగ్ను అరెస్ట్ చేశారు. శనివారం కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయిన జగ్వీర్ గురువారం రాత్రి తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. జగ్వీర్ మద్యంమత్తులో స్నేహితుడి ఇంట్లోని పనిమనిషి (23)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏఎస్ఐని అరెస్ట్ చేశారు.