రేవంత్ కేసులో బాబును తప్పించే ప్రయత్నాలు!

6 Jun, 2015 20:35 IST|Sakshi
రేవంత్ కేసులో బాబును తప్పించే ప్రయత్నాలు!

హైదరాబాద్: రేవంత్రెడ్డి ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడిని ఏ1 ముద్దాయిగా చేర్చాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి శనివారం హైదరాబాద్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి కేసు విచారణ నత్తనడకన సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కేసును వేగవంతం చేయాలని సుధాకర్రెడ్డి... ప్రభుత్వానికి సూచించారు. ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబును తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో జోక్యం చేసుకోవాలని పొంగులేటి కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు