మైనింగ్ అధికారులకు పోస్టింగ్

14 Aug, 2015 01:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జూన్‌లో రాష్ట్రానికి తాత్కాలికంగా కేటాయించిన రాష్ట్రస్థాయి అధికారులకు పోస్టింగ్ ఇస్తూ మైనింగ్ విభాగం డెరైక్టర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. మైనింగ్ విభాగం నిజామాబాద్ డిప్యూటీ డెరైక్టర్‌గా బి.భగవంతరెడ్డి నియమితులయ్యారు.

మహబూబ్‌నగర్ ఏడీ (విజిలెన్స్)గా జి.నరసింహాచారి, మెదక్ ఏడీగా ఎం.వెంకటేశ్వర్లు, హైదరాబాద్ ఏడీగా కె.రామచంద్రయ్య, సంగారెడ్డి విజిలెన్స్ ఏడీగా ఎస్.సాంబయ్య నియమితులయ్యారు. గతంలో ఈ స్థానాల్లో పనిచేసిన మైనింగ్ అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు.

>
మరిన్ని వార్తలు