హైదరాబాద్ నవాబు కుటుంబ సభ్యుడికి అవార్డు

24 Nov, 2013 23:03 IST|Sakshi

లండన్: హైదరాబాద్‌ను పాలించిన నిజాం నవాబు కుటుంబ సభ్యుడు ప్రిన్స్ మోసిన్ అలీఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది.  ప్రపంచశాంతికి, స్వంచ్ఛంద సంస్థల తోడ్పాటుకు విశేష సేవలందించినందుకుగాను ఆయనను లండన్‌లో ఘనంగా సత్కరించారు.‘వరల్డ్ పీస్ అండ్ ప్రాస్పరిటీ పౌండేషన్’కు  అలీఖాన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.  ఈ సంస్థ వార్షికోత్సవం లండన్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి నగరంలోని అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా మోసిన్ అలీఖాన్‌తో పాటు, సియాసత్ ఉర్దూ దినపత్రిక చీఫ్ ఎడిటర్ జాహిద్ అలీఖాన్, ఇండియన్ ఏయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన ఉస్మాన్ షాహిద్‌లతో పాటు వివిధ రంగాలలో సేవలందించిన మరికొందరిని అవార్డులతో సత్కరించారు.
 

మరిన్ని వార్తలు