'కాకులను కొట్టి గద్దలకు వేసినట్టుగా ఉంది'

6 Nov, 2014 16:52 IST|Sakshi
'కాకులను కొట్టి గద్దలకు వేసినట్టుగా ఉంది'

గత ప్రభుత్వం బీసీలకు ఏ విధంగా అన్యాయం చేసిందో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అదే విధానాన్ని అవలంభిస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే  ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. తెలంగాణ బడ్జెట్ కాకులను కొట్టి గద్దెలకు వేసినట్టుగా ఉందని ఆయన ఎద్దెవా చేశారు.

మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కదాన్నీ అమలు చేయడం లేదన్నారు. కేజీ టూ పీజీ అనేదాన్ని ప్రస్తావనలోకి తీసుకరాలేదని చెప్పారు. కల్యాణ లక్ష్మి స్కీమ్ అన్ని వర్గాల వారికి వర్తింపచేయాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు