‘బంధుత్వాలు కలుపుకుని మోసం’

21 Feb, 2017 14:00 IST|Sakshi
‘బంధుత్వాలు కలుపుకుని మోసం’

రాయబరేలీ: ఎక్కడికి వెళ్లినా బంధుత్వాలు కలుపుకుని మోసం చేయడం ప్రధాని నరేంద్ర మోదీకి అలవాటైందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మంగళవారం రాయబరేలీలో ఆయన ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మోదీ పాలనలో రైతులు, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

రుణమాఫీ చేయడానికి ప్రధాని వద్ద డబ్బులు లేవు కానీ.. రూ. 12 వందల కోట్ల రుణాలిచ్చి విజయ్‌ మాల్యాకు విదేశాలకు పంపారని ఆరోపించారు. తమపై మోదీ చేసిన విమర్శలను పట్టించుకోనని అన్నారు. పేదలు, రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయమన్నారు.

మరిన్ని వార్తలు