‘రైల్వే కార్మికులకూ ఓఆర్‌ఓపీ ఇవ్వాలి’

7 Sep, 2015 09:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే కార్మికులకు వన్ ర్యాంక్-వన్ పెన్షన్ వర్తింపుచేసేలా పథకాన్ని రూపొందించాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ (ఎన్‌ఎఫ్‌ఐఆర్) కేంద్రాన్ని డిమాండ్ చేసింది. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరింది. ఈ రెండు డిమాండ్లపై ప్రధానికి మోదీకి లేఖను పంపింది.

ఎన్‌ఎఫ్‌ఐఆర్ ప్రధాన కార్యదర్శి ఎం.రాఘవయ్య విలేకర్లతో మాట్లాడుతూ.. రైల్వే కార్మికులకు కూడా వన్‌ర్యాంక్-వన్ పెన్షన్ అమలు చేయాలన్నారు.  రైల్వేలోని 13.2 లక్షల మంది రైల్వే కార్మికులు సైన్యం తరహాలోనే దేశ సేవ చేస్తున్నారని చెప్పారు.

>
మరిన్ని వార్తలు