జార్ఖండ్ లోపెట్టుబడులు పెట్టాల్సిందిగా తోటి పారిశ్రామిక వేత్తలకు టాటా గ్రూపు అధినేత పిలుపునిచ్చారు. జంషెడ్ పూర్ లోని వ్యాపార ప్రారంభ రోజుల గుర్తుచేసుకున్న టాటా గ్రూప్ మూలపురుషుడు రతన్ టాటా జార్ఖండ్ రాష్ట్రంలో అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ పొటెన్షియాలిటీని అందిపుచ్చుకోవాలని దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్లకు విజ్ఞప్తి చేశారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ 'సమ్మిట్ 2017 లో ఆయన గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రతన్ టాటా వద్ద మాట్లాడుతూ దేశంలో వ్యాపారానికి గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం ఆధ్వర్యంలో న్యూ ఇండియాగాఅవతరించబోతోందన్నారు. అయితే కేవలం పారిశ్రామికంగా అభివృద్ది చెందిన ప్రాంతాలపైనే దృష్టిపెడితే సరిపోదని, ఈ ప్రగతిని మరింత విస్తరించాల్సినఅవసరం ఉందన్నారు. ఖనిజ సంపదలతో అలరారుతున్న సహజ సౌందర్యంతో విలసిల్లే ప్రదేశం జార్ఖండ్ లో పెట్టుబడులపై దృష్టిపెట్టాలని టాటా చెప్పారు.
జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించిందనీ ఆ దిశగా పురోగమిస్తూ ఇతర రాష్ట్రాలకు దీటుగా నిలుస్తోందని చెప్పారు. ఈ క్రమంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టడం చాలా లాభదాయకన్నారు. కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటూ తన సమకాలీన దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను కోరారు.
కాగా భారతదేశంలో అతిపెద్ద ప్రైవేటు కార్పొరేట్ గ్రూప్ టాటా గ్రూప్ . ప్రపంచంలోని బాగా ప్రఖ్యాతిగాంచిన సంస్థలలో ఒకటిగా గుర్తించబడిన టాటా స్టీల్ ప్రస్తానం జంషెడ్ పూర్ లో మొదలైన సంగతి తెలిసిందే.