గవర్నర్ ఆఫ్ ది ఇయర్... రాజన్

14 Jan, 2015 01:59 IST|Sakshi
గవర్నర్ ఆఫ్ ది ఇయర్... రాజన్

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రతిష్టాత్మక ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యారు. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘సెంట్రల్ బ్యాంకింగ్’ మేగజీన్ రాజన్‌ను ఈ అవార్డుకు ఎంపికచేసింది.  దేశ ఆర్థిక ఇబ్బందుల మూలాలను కనుగొనడంలో ఉన్న శక్తి సామర్థ్యాలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. మార్చి 12వ తేదీన లండన్‌లో రాజన్‌కు ఈ అవార్డు ప్రదానం జరుగుతుంది.
 

మరిన్ని వార్తలు