హై సెక్యూరిటీ ఫీచర్స్‌తో కొత్త రూ.10 నోట్లు

9 Mar, 2017 14:12 IST|Sakshi

న్యూఢిల్లీ:   కొత్త పది రూపాయల నోటును జారీ చేయనున్నట్టు  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ప్రకటించింది.  త్వరలోనే ఈ నోట్లు  అందుబాటులోకి రానున్నట్టు  గురువారం వెల్లడించింది. అధిక భద్రతా లక్షణాలతో   ఈ కొత్త  10 నోట్లను జారీ చేయనున్నట్టు తెలిపింది.  అలాగే  పాత పది రూపాయల నోట్లు కూడా చలామణిలో ఉంటాయని  స్పష్టం చేసింది.


మహాత్మా గాంధీ సీరిస్‌-2005లో  రెండు నంబర్‌ ప్యానెల్స్‌పై  ‘ఎల్‌’ (ఇన్‌ సైట్‌) లెటర్‌ తోపాటు, ఆర్‌బీఐ గవర్నర్‌  ఉర్జిత్‌పటేల్‌ సంతకంతో వీటిని లాంచ్‌ చేయనున్నట్టు తెలిపింది. ఎడమ నుంచి కుడికి మొదటి మూడు ఆల్ఫా-న్యూమరిక్ అక్షరాలు (ఉపసర్గ)  ఆరోహణ క్రమంలో పాత పరిమాణంలోనే ఉండనున్నట్టు ఆర్బిఐ పేర్కొంది. గతంలో బ్యాంకు జారీ చేసిన రూ.10 విలువ కలిగిన అన్ని బ్యాంకు నోట్లు కూడా  చట్టబద్ధంగా  చెల్లుబాటులోఉంటాయని వివరణ ఇచ్చింది.

 
 

మరిన్ని వార్తలు