‘ఐరాస భద్రతామండలిని సంస్కరించాలి’

1 Mar, 2015 00:24 IST|Sakshi

యూఎన్: ఐక్యరాజ్య సమితి భద్రతామండలిని బలోపేతం చేయాల్సిన అవసరముందని భారత్‌తో సహా జీ4 దేశాలు పేర్కొన్నాయి. 21వ  శతాబ్దానికి తగినట్లుగా, మరింత ప్రాతినిధ్యం పెరిగేటట్లుగా భద్రతామండలిని సంస్కరించాలని భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్‌లు అభిప్రాయపడ్డాయి. ఈ మేరకు శనివారం ఆ దేశాలు బెర్లిన్‌లో సమావేశమై భద్రతామండలి బలోపేతానికి సంబంధించి తమ అభిప్రాయాలను వెల్లడించాయి.

ఐక్యరాజ్యసమితి ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తి అయినా  ఇంకా సంస్కరణలు రూపుదాల్చలేదన్నాయి. భద్రతామండలి సంస్కరణలను సాధారణ సభ అధ్యక్షుడు సామ్ కుతెసా ఆహ్వానించారు. ఈ విషయమై పరస్పరం సహకరించుకోవాలని జీ4 దేశాలు తీర్మానించాయి. భద్రతామండలి సభ్యత్వాన్ని విస్తరించాలని చైనా ప్రతినిధి లీ జీయీ అన్నారు.
 

మరిన్ని వార్తలు