నితీష్ కుమార్ కు ఊరట

12 Feb, 2015 21:19 IST|Sakshi
నితీష్ కుమార్ కు ఊరట

పాట్నా: బిహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ కు ఊరట లభించింది. శాసనసభపక్ష నేత ఎన్నికపై స్టే ఇచ్చేందుకు పాట్నా హైకోర్టు నిరాకరిచింది. నితీష్ ఎన్నిక చట్ధవిరుద్దమంటూ నిన్న ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ సవరించింది. జేడీ(యూ) శాసనసభా పక్ష నేతగా నితీష్ కుమార్ కొనసాగొచ్చని స్పష్టం చేసింది. జేడీ(యూ) సహా ఏ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని పేర్కొంది. హైకోర్టు తాజా ఆదేశాలతో సీఎం పదవి చేపట్టేందుకు నితీష్ కుమార్ కు అడ్డంకులు తొలగాయి.

మరిన్ని వార్తలు