సొంత ‘గని’ అభివృద్ధి

18 Aug, 2013 01:29 IST|Sakshi
 కోల్‌కతా: ప్రభుత్వరంగంలోని ఆర్‌ఐఎన్‌ఎల్ (విశాఖ ఉక్కు) త్వరలో రాజస్థాన్‌లో తన మొట్టమొదటి ఇనుప ఖనిజ గనిని అభివృద్ధి చేసుకోనుంది. సంస్థ డెరైక్టర్ (ఫైనాన్స్) ఎం.మధుసూదన్ శనివారం ఇక్కడ ఈ విషయాన్ని తెలిపారు. ప్రభుత్వ నుంచి ఈ మేరకు లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను అందుకున్నట్లు ఆయన తెలిపారు. దాదాపు 900 హెక్టార్లలో విస్తరించి  ఉన్న ఈ క్షేత్రంలో 230-250 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ రిజర్వ్‌లు ఉన్నట్లు అంచనా.
 
మరిన్ని వార్తలు