సికింద్రాబాద్‌ నుంచి 200కి.మీ వేగంతో నడిచే రైలు

22 Jan, 2017 21:31 IST|Sakshi
సికింద్రాబాద్‌ నుంచి 200కి.మీ వేగంతో నడిచే రైలు
హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ దేశంలోనే అత్యంత వేగంగా నడిచే రైలు ప్రారంభానికి వేదిక కానుందా?. తాజాగా పరిస్ధితులు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. భారతీయ రైల్వేలు రష్యా రైల్వేతో సహకారంతో రైళ్లను గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టించేందుకు సిద్ధమౌతోంది. సికింద్రాబాద్‌-నాగ్‌పూర్‌ల మధ్య ఈ రైలును నడపాలని రైల్వే శాఖ యోచిస్తోంది. కాగా, దేశంలోని రైళ్లలో గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే అత్యధికంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేరుస్తోంది.
మరిన్ని వార్తలు