‘బాహుబలి’ ఫీవర్‌ మధ్య ప్రభాస్‌ ట్విస్టు

27 Apr, 2017 18:38 IST|Sakshi
‘బాహుబలి’ ఫీవర్‌ మధ్య ప్రభాస్‌ ట్విస్టు
  • ‘సాహో’ అంటూ అభిమనులకు పలుకరింత
  • 2018లో రిలీజ్‌.. అలరిస్తున్న ప్రభాస్‌ కొత్త లుక్‌

  • దేశమంతా ‘బాహుబలి-2’ ఫీవర్‌తో ఊగిపోతున్న సమయంలో ‘సాహో’ అంటూ ప్రభాస్‌ కొత్త లుక్‌తో అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ’బాహుబలి-2’ సినిమా శుక్రవారం విడుదల అవుతున్న నేపథ్యంలో ఒకరోజు ముందే ‘సాహో’ టీజర్‌ను అభిమానులకు పరిచయం చేశాడు.  గత ఐదేళ్లుగా ‘బాహుబలి’ప్రాజెక్టులో లీనమైన ప్రభాస్‌ మరో సినిమా చేయని సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక సినిమా తర్వాత ప్రభాస్‌ ఎలాంటి చిత్రంలో నటిస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీతో 2018లో సరికొత్త లుక్‌తో అభిమానులను అలరిస్తానంటూ కొత్త టీజర్‌తో ప్రభాస్‌ ప్రామిస్‌ చేశాడు.

    ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ‘సాహో’ టీజర్‌ గురువారం అధికారికంగా యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ టీజర్‌లో ఏముందంటే..

    ఓపెన్‌ చేస్తే, జూమ్‌ అవుట్‌... అవుట్‌... అవుట్‌... కట్‌ చేస్తే ప్రభాస్‌ కన్ను. మళ్లీ కొంచెం జూమ్‌ అవుట్‌ చేస్తే... ముఖంపై రక్తంతో ఓ కుర్చీలో కూర్చున్న ప్రభాస్‌! అప్పుడు ఓ డైలాగ్‌.
    వాయిస్‌ ఓవర్‌ (విలన్‌): ఆ రక్తం చూస్తేనే అర్థమవుతుంది రా... వాణ్ణి చచ్చేంతలా కొట్టారని!
    (విలన్‌) అనుచరుడు: సార్‌... అది వాడి రక్తం కాదు, మన వాళ్లది. కుర్చీలో వెనక్కి పడి ఉన్న ప్రభాస్‌ మెల్లగా ముఖంపై రక్తాన్ని తుడుచు కుంటూ స్ట్రయిట్‌గా కూర్చుని డైలాగ్‌ చెబుతారు. అదేంటంటే...
    ప్రభాస్‌: ఇట్స్‌ షో టైమ్‌!
    శంకర్‌-ఎహసన్‌-లాయ్‌ త్రయం అందించిన నేపథ్య సంగీతం ఈ టీజర్‌కు స్పెషల్‌ అట్రాక్షన్‌.