హత్య కేసులో ఎమ్మెల్యేకు జీవితఖైదు

5 Jan, 2015 17:13 IST|Sakshi

జలౌన్: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీకి చెందిన చర్ఖారీ ఎమ్మెల్యే కాప్టన్ సింగ్ రాజ్‌పుత్ కు జీవితఖైదు పడింది. 2002 నాటి హత్య కేసులో కాప్టన్ సింగ్ రాజ్‌పుత్ కు, ఆయన సోదరుడికి ప్రత్యేక కోర్టు సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఏడుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. 

2002, ఏప్రిల్ 20న కిషన్ దుబే అనే వ్యక్తిపై దాడిచేసి చంపిన ఉదంతంలో రాజ్‌పుత్, అతడి సోదరుడు, మరో 9 మందిపై ఈ కేసు నమోదైంది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే కాప్టన్ సింగ్ రాజ్‌పుత్, ఆయన సోదరుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు