శాంసంగ్ కొత్త 4జీ ఫోన్ ..ధర ఎంతోతెలుసా?

23 Aug, 2016 15:15 IST|Sakshi
శాంసంగ్ కొత్త 4జీ ఫోన్ ..ధర ఎంతోతెలుసా?

సొంత ఆపరేటింగ్ సిస్టమ్ టిజెన్తో రన్ అయ్యే మొదటి 4జీ సపోర్టు స్మార్ట్ఫోన్ను దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. శాంసంగ్ జెడ్2 పేరుతో ఆవిష్కరించిన ఈ ఫోన్ ధర రూ. 4,590గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ లాంచింగ్తో మార్కెట్లో శాంసంగ్ 4జీ స్మార్ట్ఫోన్ల జాబితా 22కు చేరింది. రిలయన్స్ జియో సర్వీసులతో సరసమైన ధరకు ఈ ఫోన్ను నియోగదారులకు ముందుకు తీసుకొచ్చింది. ఈ ఫోన్ను పూర్తిగా బెంగళూరు టీమ్ డెవలప్ చేసినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ఫోన్ లాంచింగ్తో ఫీచర్ ఫోన్లను వాడే 550 మిలియన్ యూజర్లను తన సొంతం చేసుకోవాలని శాంసంగ్ ప్లాన్ చేస్తోంది. వారిని బెటర్ స్మార్ట్ఫోన్ అనుభూతికి అప్గ్రేడ్ చేయాలని యోచిస్తోంది.

జియో యాప్స్, వీడియో కాలింగ్, ఓటీజీ అప్డేట్స్తో ఈ కొత్త ఫోన్ యూజర్లను అలరించనుంది. డేటా అవసరం లేకుండా మొబైల్ బ్యాంకింగ్ వాడుకునేలా మై మనీ ట్రాన్సఫర్ యాప్ను కూడా ఈ ఫోన్ ఆఫర్ చేస్తోంది. ఈ యాప్ను ఇండియాలోని శాంసంగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ అభివృద్ధి చేసింది. 12 భాషలను శాంసంగ్ జెడ్2 సపోర్టు చేస్తుందని కంపెనీ తెలిపింది. బ్లాక్, వైన్ రెడ్, గోల్డ్ కలర్ వేరియంట్లలో లభ్యమయ్యే ఈ ఫోన్ సోమవారం నుంచి పే టైమ్, శాంసంగ్ ఆఫ్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది.


శాంసంగ్ జడ్2 ఫీచర్లు...
4 అంగుళాల డిస్ప్లే
1.5 గిగాహెడ్జ్ ప్రాసెసర్
480x800 పిక్సెల్స్ రెజుల్యూషన్
1 జీబీ ర్యామ్
8 జీబీ స్టోరేజ్
128 జీబీ విస్తరణ మెమరీ
టిజెన్ ఓఎస్
5 ఎంపీ వెనుక కెమెరా
0.3 ఎంపీ ముందు కెమెరా
1500 ఎంఏహెచ్ బ్యాటరీ
టిజెన్ ఓఎస్ ఆధారితంగా మొదటి స్మార్ట్ఫోన్ను శాంసంగ్ గతేడాదే మార్కెట్లోకి తీసుకొచ్చింది.

మరిన్ని వార్తలు