సంజయ్ దత్ సతీమణి ఆస్పత్రిలో చేరిక!

8 Jan, 2014 21:32 IST|Sakshi
సంజయ్ దత్ సతీమణి ఆస్పత్రిలో చేరిక!
సంజయ్ దత్ సతీమణి మాన్యత బుధవారం ముంబైలోని గ్లోబల్ ఆస్పత్రిలో చేరారు. మాన్యత హృదయ, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.  
 
మాన్యతకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని గ్లోబల్ ఆస్పత్రి హృదయ, కాలేయ వైద్య నిపుణుడు డాక్టర్ అజయ్ చఘులే తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం మాన్యతకు సర్జరీ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయం తెలుస్తుందన్నారు. 
 
మాన్యత ఆరోగ్యం క్షీణించడంతో సంజయ్ దత్ 30 రోజుల పెరోల్ పై విడుదలయ్యారు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో పూణేలోని ఎర్రవాడ జైలులో సంజయ్ దత్ శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 
 
మరిన్ని వార్తలు