40% తగ్గిన ఎస్‌బీఐ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు

16 Sep, 2013 01:29 IST|Sakshi

ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌కు బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఎస్‌బీఐ ముందస్తు పన్ను చెల్లింపులు(అడ్వాన్స్ ట్యాక్స్) 40% తగ్గి రూ. 1,120 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే కాలానికి రూ.1,820 కోట్లను చెల్లించింది. కాగా, ఈ కాలంలో బ్యాంకు విదేశీ కార్యాలయాలు మాత్రం రూ. 192 కోట్ల పన్నును అదనంగా చెల్లించాయి. ఈ విషయాన్ని ఎస్‌బీఐ   తెలిపింది. ముంబై ప్రాంతానికి సంబంధించి పన్ను చెల్లింపులు తగ్గే అవకాశమున్నట్లు ఐటీ శాఖ సీనియర్ అధికారి ఒకరు చె ప్పారు.

మరిన్ని వార్తలు