‘ప్రకటనల’ తీర్పుపై పునస్సమీక్ష

10 Sep, 2015 09:42 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలపై రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిల ఫొటోలు మినహా మరెవ్వరి ఫోటోలూ పెట్టరాదంటూ తానిచ్చిన చరిత్రాత్మక తీర్పును పునస్సమీక్షించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.

ప్రభుత్వ ప్రకటనలపై సీఎంల ఫోటోలు ప్రచురించేందుకు అనుమతించాలంటూ తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, అస్సాం ప్రభుత్వాలు సుప్రీం కోర్టును కోరాయి. దీంతో వీరి వాదనలను పెప్టెంబర్ 14న వినేందుకు జస్టిస్ రంజన్ గొగోయ్ అంగీకరించారు.

మరిన్ని వార్తలు