బాబుతో భేటీ కానున్న సచివాలయ ఉద్యోగ నేతలు

3 Oct, 2015 09:49 IST|Sakshi

హైదరాబాద్ : పీఆర్సీ జీవో జారీ చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు. పీఆర్సీపై తక్షణమే జీవో జారీ చేయాలని సంఘాల నేతలు చంద్రబాబుకు విజ్ఞప్తి చేయనున్నారు.

అలాగే ఈ ఏడాది విద్యా సంవత్సరం మధ్యలో రాజధానికి ఉద్యోగుల తరలింపుపై వారు ఈ సందర్భంగా చంద్రబాబు ఎదుట అభ్యంతరం వ్యక్తం చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం అయితే తరలింపునకు సిద్ధమని ఉద్యోగులు చంద్రబాబుకు స్పష్టం చేయనున్నారు. అయితే ఉద్యోగుల గృహనిర్మాణాలపై సదరు నేతలో చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని సమాచారం.

మరిన్ని వార్తలు