రోహిత్‌ ఔట్‌.. రిషబ్‌ ఇన్‌

15 Jun, 2017 18:42 IST|Sakshi
రోహిత్‌ ఔట్‌.. రిషబ్‌ ఇన్‌

ఢిల్లీ: ఛాంపియన్స్‌ ట్రోఫీ ముగిసిన అనంతరం వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, పేస్‌ బౌలర్‌ జస్పీత్‌ బుమ్రాలకు ఈ జట్టులో చోటు దక్కలేదు. వారి స్థానంలో యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌, కుల్‌దీప్‌ యాదవ్‌లకు జట్టులో స్థానం దక్కింది.  

కోహ్లీ నేతృత్వంలో 15మంది సభ్యుల గల భారత బృందం ఈ నెల 23 నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్‌ ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ యాక్టింగ్‌ సెక్రటరీ అమితాబ్‌ చౌదరి గురువారం ప్రకటించారు.

జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రహానె, మహేంద్ర సింగ్‌ ధోనీ(వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్‌‌), యువరాజ్‌ సింగ్‌, కేదార్‌ జాదవ్‌, హర్దిక్‌ పాండ్య, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, దినేశ్‌ కార్తీక్‌(వికెట్‌ కీపర్ బ్యాట్స్‌మన్‌‌), రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్ బ్యాట్స్‌మన్‌‌).

మరిన్ని వార్తలు