హనీషా పాత్రపై ఆధారాలు పంపండి

18 Aug, 2015 02:08 IST|Sakshi

రిషితేశ్వరి మృతికేసులో ఆదేశించిన జాతీయ మహిళా కమిషన్

గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో విద్యార్థిని హనీషా పాత్రపై ఆధారాలుంటే తమకు పంపాలని జాతీయ మహిళా కమిషన్ నాలుగు రోజుల కిందట పోలీసు ఉన్నతాధికారుల్ని ఆదేశించింది.

దీంతో పోలీసు అధికారులు హనీషా పాత్రపై తమవద్ద ఉన్న ఆధారాలు పంపించారు. విద్యార్థిని భవిష్యత్తు దృష్ట్యా జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. దీంతో ఆమె పాత్రపై ఆధారాలు పంపాలని పోలీసుల్ని ఆదేశించింది.
 
 
 
 

మరిన్ని వార్తలు