దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా పులివెందులలో వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమం ప్రారంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 'వైఎస్ఆర్ కుటుంబం'లో చేరడానికి 9121091210 ఫోన్ నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మిస్డ్కాల్ ఇస్తే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడి కార్యాలయంతో నేరుగా మాట్లాడే అవకాశముంటుంది. చంద్రబాబు పాలనలో ఎదురవుతున్న ఇబ్బందులు, కష్టాలను ప్రజలు తెలియజేయవచ్చు.
వైఎస్ఆర్ కుటుంబం ప్రారంభం..!
సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 2వరకు జరిగే వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని వైఎస్ జగన్ పిలుపు.
తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్కు ఘన నివాళి
నేడు తెలుగు రాష్ట్రాల్లో దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 8వ వర్థంతి కార్యక్రమాలు జరిగాయి.
వైఎస్ఆర్కు కుటుంబ సభ్యుల ఘన నివాళి
నేడు వైఎస్ఆర్ 8వ వర్థంతి. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు.
‘ప్రజల గుండె చప్పుడు విన్న నేత వైఎస్ఆర్’
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమం జరిగింది.
కేంద్ర కేబినెట్: రేసులోకి తెలుగు వ్యక్తి
తాజాగా చేపట్టనున్న కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరిద్దరికి ప్రాతినిధ్యం లభించే అవకాశం కనిపిస్తోంది.
రైతుగా ఉంటే ఆత్మహత్య చేసుకునేవాణ్ని: విద్యాసాగర్ రావు
దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తీవ్రంగా స్పందించారు.
విస్తరణ వేళ: అరుణ్ జైట్లీతో కేసీఆర్ భేటీ
టీఆర్ఎస్ పార్టీ కూడా కేంద్ర కేబినెట్లో చేరే అవకాశముందని ఊహాగానాలు
ప్రజాకవి సోమన్న అరెస్టు దారుణం: ఉత్తమ్
ప్రజా కవి ఏపురి సోమన్న అరెస్టు ప్రభుత్వ దమనకాండకు పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
********** జాతీయం **********
ఆ కేంద్రమంత్రి రాజీనామా వెనుక కొత్త కోణం
బీజేపీ అధిష్టానం సూచన మేరకు మంత్రులంతా స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్టు ఇప్పటివరకు అంతా అనుకున్నారు. కానీ..
కేంద్ర కేబినెట్లోకి కొత్త ముఖాలు
పదవుల కోసం నిరీక్షిస్తున్న ఆశావహుల్లో క్షణక్షనానికి ఉత్కంఠ పెరుగుతోంది.
రాజకీయాలకు అమ్మాయిలు ఎందుకు దూరం?
పొలిటికల్ పాఠాలకు బీజాలు పడే విశ్వవిద్యాలయ దశ నుంచే వాళ్లు దూరంగా ఉంటుండం చర్చనీయాంశంగా మారుతోంది.
భారీ వర్షాలు.. గురుద్వారాలో బక్రీద్ ప్రార్థనలు
ఉత్తరాఖండ్ లో మాత్రం ఓ భిన్నమైన దృశ్యం దర్శనమిచ్చింది.
విద్యార్థిని ఉసురు తీసిన నీట్ వివాదం
‘నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పై తమిళనాడులో రగిలిన వివాదం ఓ విద్యా కుసుమం ఉసురు తీసింది.
పార్టీ అంటే వారిద్దరే!
నరేంద్ర మోదీ, అమిత్షా లాంటి వ్యక్తులకన్నా పార్టీయే సర్వోన్నతమైనదని చెప్పడానికీ, చూపడానికి పార్టీలో ఈ ఏర్పాటు
ఆర్ఎస్ఎస్ చీఫ్తో అమిత్ షా భేటీ!
మరికొద్ది గంటల్లో మంత్రులుగా ప్రమాణం చేయనున్నవారి జాబితాకు సంఘ్ ఆమోదం కూడా లభించినట్లు సమాచారం.
కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
రాష్ట్రంలోని బాలికలకు ఉచిత విద్యను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు భారీ నిధులతో ఒక ప్రణాళికను కూడా సిద్దం చేసింది.
********* అంతర్జాతీయం**************
జాతి విద్వేషం:అమెరికాలో మరో దారుణ హత్య
అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. భారతీయ సిక్కు యువకుణ్ని ఓ అమెరికన్ కత్తితో దారుణంగా పొడిచి చంపాడు.
స్కూల్లో అగ్నిప్రమాదం.. ఏడుగురు బాలికల మృతి
కెన్యా రాజధాని నైరోబీలోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు బాలికలు చనిపోయారు.
అమెరికా రాయబారిగా కెన్నెత్ జష్టర్
భారత్లో అమెరికా రాయబారిగా కెన్నెత్ జష్టర్(62)ను నియమించినట్లు అమెరికా ప్రకటించింది.
చైనాకు సంకేతాలు పంపిన భారత్
చైనా తాటాకు చప్పుళ్లుకు భారత్ దీటుగానే బదులిస్తోంది.
400 మంది ముస్లింలు ఊచకోత
మయన్మార్ మట్టి రోహింగ్యా ముస్లింల నెత్తురుతో తడిసింది. రఖైన్ రాష్ట్రంలో మొదలైన హింసాకాండ రావణకాష్టంలా రగులుతూనే ఉంది.
********వాణిజ్యం***********
జియోకి కౌంటర్:ఎయిర్టెల్ సూపర్ ప్లాన్స్
దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్ టెల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఇన్ఫోసిస్ ఎండీగా ప్రవీణ్ రావు కొనసాగుతారా?
భారతీయ రెండవ అతిపెద్ద సాఫ్టవేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మధ్యంతర సీఈవో, ఎండీయుఎన్ ప్రవీణ్ రావును కొత్త మేనేజింగ్ డైరక్టర్గా నియమించేందుకు యోచిస్తోంది.
ఆ నోట్ల సరఫరాను పెంచుతున్న ఆర్బీఐ
వినాయక చవితి సందర్భంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబేలా
********* సినిమా *************
దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు: నటి
నటి కీర్తి సురేష్ అనిత ఆత్మహత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆర్.నారాయణమూర్తికి చేదు అనుభవం
తమ ప్రాంతంలో షూటింగ్కు అనుమతి లేదంటూ స్థానిక నాయకులు అడ్డుపడటంతో ఆయన అగ్రహానికి లోనయ్యారు.
'పైసా వసూల్' అయ్యింది..!
నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పైసా వసూల్ కు తొలి రోజు డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం భారీ స్థాయిలో వచ్చాయి.
******** క్రీడలు ***************
సిక్సర్లతో చెలరేగి.. ఆపై కడుపునొప్పితో!
క్రికెట్ బాహుబలిగా పేరొందిన వెస్టిండీస్ ప్లేయర్ రకీమ్ కార్న్వాల్ మరోసారి అద్బుత ఇన్నింగ్స్ తో మెరుపులు మెరిపించాడు.
యువీకి ప్రధాని మోదీ లేఖ
క్యాన్సర్ పై యువీ చేస్తున్న అవగాహన కార్యక్రమానికి ముగ్దులైన ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
షరపోవా జోరు
యూఎస్ గ్రాండ్ స్లామ్లో రష్యా భామ మారియా షరపోవా తన జోరును కొనసాగిస్తున్నారు.