నగరంలో 'కీచక' పీఈటీ.. !

28 Jan, 2017 11:40 IST|Sakshi

హైదరాబాద్‌: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు 'కీచక' అవతారం ఎత్తాడు. అభంశుభం తెలియని బాలికల పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. దీంతో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన అతడిపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. నగరంలోని ఎల్బీనగర్‌ బండ్లగూడలో శనివారం ఈ ఘటన వెలుగుచూసింది.

ఓ ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న రాజా గతకొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, వారిని లైంగికంగా వేధిస్తున్నాడని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు శనివారం పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. వారికి పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పీఈటీని అదపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు