-
న్యూఢిల్లీ: బీజేపీకి ఓటు వేయని 70 శాతం మంది భారతీయులు పాకిస్తానీలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా గురువారం ట్వీటర్లో వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటుడు షారుక్ఖాన్ పాకిస్తాన్ టైస్ట్ హఫీజ్ అయితే.. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ఓ మండేలా అని, భారత్లో ప్రధాని నరేంద్ర మోదీనే ఓ గొప్ప విషయమని కపిల్ మిశ్రా ట్విటర్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
భారత్లో మత అసహనం పెరిగిపోతోందని షారుక్ వ్యాఖ్యానించడంపై బీజేపీ ఎంపీ యోగీ ఆదిత్యనాథ్ షారుక్ఖాన్ను సయిద్ హఫీజ్తో పోల్చిన విషయం తెలిసిందే. ప్రకాష్సింగ్ బాదల్ భారతదేశపు మండేలా అని మోదీ అక్టోబర్లో అభివర్ణించారు. వీటిపై స్పందిస్తూ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు.