యూపీఏపై వ్యతిరేకత లేదు: శరద్ పవార్

25 Jan, 2014 02:03 IST|Sakshi

ముంబై: యూపీఏ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న వార్తలను కేంద్ర వ్యవసాయ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్‌పవార్ కొట్టిపారేశారు. దేశంలో రాజకీయ పరిస్థితులపై ఇప్పటికీ ఓ స్పష్టత లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు.. ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు, కొత్త ఓటర్లు కీలక పాత్ర వహించే అవకాశాలున్నాయని చెప్పారు. ఎన్‌సీపీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా శరద్‌పవార్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. 73 ఏళ్ల పవార్ ఇప్పటివరకు 8 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు