ఫడ్నవిస్ ప్రభుత్వంలో చేరనున్న శివసేన

4 Dec, 2014 14:05 IST|Sakshi
ఫడ్నవిస్ ప్రభుత్వంలో చేరనున్న శివసేన

ముంబై: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో శివసేన భాగంకానుంది. 12 మంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించడంతో శివసేన ప్రభుత్వంలో చేరడం ఖాయమైంది.

శివసేనకు 12 మంత్రి పదవులు ఇచ్చినట్టు ఫడ్నవిస్ గురువారం అధికారికంగా వెల్లడించారు. ఇందులో 5 కేబినెట్ పదవులున్నాయని వెల్లడించారు. శుక్రవారం వీరు ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. అయితే, తమకు కేటాయించనున్న శాఖల విషయంలో శివసేన గుర్రుగా ఉందని సమాచారం.

మరిన్ని వార్తలు