సోనియాపై రూ.10కోట్ల దావా!

19 Nov, 2013 01:36 IST|Sakshi

భోపాల్: అసత్య ఆరోపణలతో తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఆయన భార్య సాధనాసింగ్ నోటీసు జారీ చేశా రు. చౌహాన్ల ఇంట డబ్బులను లెక్కించే మెషిన్ ఉందని, ముఖ్యమంత్రి తన సమీప బంధువులకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారంటూ పత్రికల్లో, ఇంటర్నెట్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు ఇవ్వడంతో చౌహాన్ దంపతులు చర్య లు చేపట్టారు. ఆరోపణలను వెనక్కి తీసుకుంటూ 15రోజుల్లోగా ప్రకటన లివ్వకపోతే రూ.10కోట్ల మేర పరువు నష్టం వాటిల్లిందంటూ వ్యాజ్యం వేస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు