నిన్న జమ్ములో దాడి తమ పనే: షోహడ బ్రిగేడ్

27 Sep, 2013 09:06 IST|Sakshi

జమ్మూలోని కథువా, సాంబ జిల్లాలోని నిన్న జరిపిన దాడి తమ పనే అని తీవ్రవాద సంస్థ షోహద బ్రిగేడ్ ప్రకటించింది. ఆ తీవ్రవాద సంస్థ ప్రతినిధి సామి- ఉల్- హక్ ఈ మేరకు మీడియాకు శుక్రవారం ఫోన్ ద్వారా వెల్లడించారు. ఆ రెండు ప్రాంతాల్లో తీవ్రవాదులు జరిపిన దాడిలో ఆర్మీ అధికారి సహా 12 మంది మరణించిన సంగతి తెలిసిందే.

అయితే తీవ్రవాదుల దాడి అనంతరం అయా ప్రాంతాల్లో ఉన్నతాధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రత క్యాంపులు, పోలీసు స్టేషన్లు సహా అన్ని ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయడమే కాకుండా భద్రత సిబ్బందిని మొహరించారు.

మరిన్ని వార్తలు