భూమి సమస్యలు పరిష్కరించుకోండి: ఆర్డీవో

10 Aug, 2015 14:44 IST|Sakshi

వేముల (వైఎస్సార్ జిల్లా): భూములకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే మీ ఇంటికి మీ భూమి సదస్సులో పరిష్కరించుకోవాలని జమ్మలమడుగు ఆర్డీవో వినాయకం రైతులకు విజ్ఞప్తిచేశారు. సోమవారం వేములలో జరిగిన 'మీ ఇంటికే మీ భూమి' సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల సమస్యలు పరిష్కారం కాక రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, అందుకే ప్రభుత్వం మీ ఇంటికే మీ భూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు