న్యూఢిల్లీ: భారత్–రష్యా మధ్య ఉన్న 70 ఏళ్ల దౌత్య సంబంధాలపై లఘుచిత్రం నిర్మించనున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి గాను పాత ఛాయాచిత్రాలు, వీడియో క్లిపింగ్లు పంపాలని రష్యాను ఆ శాఖ సీనియర్ అధికారి సోమవారం కోరారు.
రెండు దేశాల మధ్య 1947లో దౌత్యసంబంధాలు మొదలయ్యాయని తెలిపారు. ఇరుదేశాల 70వ దౌత్యసంబంధాల వార్షికోత్సవం సందర్భంగా ఈ లఘుచిత్రాన్ని రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 13న ప్రదర్శిస్తామన్నారు.