మరణశిక్ష పడిన తమిళ జాలర్ల విడుదల

19 Nov, 2014 17:14 IST|Sakshi
మరణశిక్ష పడిన తమిళ జాలర్ల విడుదల

న్యూఢిల్లీ: మరణశిక్ష పడిన ఐదుగురు తమిళ జాలర్లను శ్రీలంక విడుదల చేసింది. వీరికి విధించిన మరణశిక్షను శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే రద్దు చేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కొలంబోలోని భారత అధికారులకు ఈ ఐదుగురిని అప్పగించారని తెలిపాయి.

భారత్ నుంచి శ్రీలంకకు మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేశారన్న నేరంపై కొలంబో హైకోర్టు అక్టోబర్ 30న వీరికి మరణశిక్ష విధించింది. వీరికి విధించిన శిక్షను రద్దు చేయాలని భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు చివరకు ఫలించాయి.

మరిన్ని వార్తలు