తిరుమల: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం కల్యాణోత్సవం విరామ సమయంలో టీటీడీ మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి కుమార్తె పింకీరెడ్డితో కలసి ఆమె సుపథం క్యూ ద్వారా ఆలయానికి వచ్చారు.
మహాలఘు దర్శనంలోనే వారు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల భక్తులతో ఫొటోలు, సెల్ఫీలతో శిల్పాశెట్టి, పింకీరెడ్డి ఆనందంగా గడిపారు.