న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి ఢిల్లీలో కలకలం రేపింది. ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తెల్లవారుజామున 4 గంటలకు ఓ సీనియర్ మహిళా జర్నలిస్ట్కు మెసేజ్ పంపినట్టు సమాచారం. చాలా మాట్లాడాల్సింవుందని అందులో పేర్కొన్నట్టు తెలిసింది.
అయితే ఆ మహిళా పాత్రికేయురాలు ఎవరనేది ఇంకా వెల్లడికాలేదు. మహిళా జర్నలిస్ట్తో సునంద ఏం చెప్పాలను కున్నారనేది ఇప్పుడు కీలకంగా మారింది. శశి థరూర్ ప్రవర్తనతో విసిగిపోయి ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.