తేజ్పాల్కు మధ్యంతర బెయిల్ పొడిగించిన సుప్రీం

3 Jun, 2014 11:55 IST|Sakshi

లైంగిక వేధింపుల కేసులో తరుణ్ తేజ్పాల్కు మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ నెల 27 వరకు తేజ్పాల్ మధ్యంతర బెయిల్ పొడిగిస్తున్నట్లు సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. తేజ్పాల్ తల్లి శకుంతల తేజ్పాల్ కేన్సర్ వ్యాధితో బాధపడుతూ గత నెలలో మరణించారు. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసింది.

గతేడాది నవంబర్లో గోవా రాజధాని పనాజీలో ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు