తెలంగాణ బిల్లు చర్చకు వస్తుందో రాదో చెప్పలేం: షిండే

14 Nov, 2013 16:32 IST|Sakshi
తెలంగాణ బిల్లు చర్చకు వస్తుందో రాదో చెప్పలేం: షిండే
రాష్ట్ర విభజన కోసం ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం)తో నవంబర్ 18న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశం అవుతారు అని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. హైదరాబాద్ లో బాలల చలన చిత్రోత్సవాలు జరుగుతున్న కారణంగానే జీవోఎంతో కిరణ్ కుమార్ రెడ్డి భేటి కాలేకపోయారని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
వచ్చే కేబినెట్ సమావేశంలో తెలంగాణ బిల్లు గురించి చర్చకు వస్తుందో లేదో తాను ఇప్పుడే చెప్పలేను అని షిండే మరో ప్రశ్నకు జవాబిచ్చారు. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తప్పకుండా తెలంగాణ బిల్లును ప్రవేశ పెడుతాం అని అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జీవోఎంతో కిరణ్ కుమార్ రెడ్డి హాజరుకాకపోవడంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు జవాబుగా వివరణ ఇచ్చారు. 
 
మరిన్ని వార్తలు