ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు తేజ్‌పాల్ కేసు

6 Dec, 2013 05:58 IST|Sakshi

న్యూఢిల్లీ/పణజీ: సహోద్యోగినిపై తెహెల్కా పత్రిక వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ లైంగిక దాడి కేసు విచారణను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించే అవకాశాలున్నాయని గోవా సీఎం మనోహర్ పారికర్ చెప్పారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి తాము సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరిస్తామని, మహిళా జడ్జిని నియమిస్తామని చెప్పారు. బాధిత యువతికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
 

మరిన్ని వార్తలు