అనూహ్య కేసులో ‘ఆధార’ం!

5 Feb, 2014 00:51 IST|Sakshi

సాక్షి ముంబై: ముంబైలో దారుణ హత్యకు గురైన ఎస్తేర్ అనూహ్య కేసులో ‘ఆధార్’ చిక్కుముడి విప్పనుందా? కుర్లా రైల్వే స్టేషన్‌లో అనూహ్యతోపాటు సీసీటీవీలో కన్పించిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ఆధార్ కార్డు సాయం తీసుకోనున్నట్టు తెలిసింది. సీసీటీవీలో కన్పించిన ఆ వ్యక్తి కళ్లను సాధ్యమైనంత వరకు జూమ్ చేసి ఆధార్ కార్డు పరిజ్ఞానంతో పోల్చి చూస్తే అతడు ఎవరనేది తెలుసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

 

కానీ కెమెరాల్లో ఆ వ్యక్తి ముఖమే సరిగ్గా కన్పించనప్పుడు కళ్లను గుర్తించి, ఆయనెవరో తెలుసుకోవడం కష్టమని కొందరు అంటున్నారు.


 

మరిన్ని వార్తలు