మంత్రి ఎక్కిన విమానంలో సాంకేతిక లోపం!

23 Nov, 2016 21:46 IST|Sakshi
మంత్రి ఎక్కిన విమానంలో సాంకేతిక లోపం!
చెన్నై: మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో చెన్నై ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఈ ఆకస్మిక అవాంతరంతో మంత్రి చెన్నై నుంచి హైదరాబాద్‌కు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. 
 
స్పైస్‌జెట్‌ విమానం ఆలస్యం
ఇక గన్నవరం విమానాశ్రయం నుంచి చెన్నై వెళ్లాల్సిన స్పైస్‌ జెట్‌ విమానం ఆలస్యమైంది. గన్నవరం విమానాశ్రయం నుంచి సాయంత్రం 5 గంటలకు వెళ్లాల్సిన విమానం రాత్రి 8 గంటలు అయినా బయలుదేరలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. బెంగళూరు-గన్నవరం-చెన్నై కనెక్టివిటీ స్పైస్‌జెట్‌ విమానం గన్నవరం సాయంత్రం 4 గంటలకు చేరుకొని.. సాయంత్రం 5 గంటలకు చెన్నై బయలుదేరుతోంది. అయినా.. అనుకోనిరీతిలో ఆలస్యం కావడంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటున్నారు. 
మరిన్ని వార్తలు