సోనియా ఇంటికి క్యూ కట్టిన టీ.కాంగ్రెస్ నేతలు

21 Feb, 2014 13:03 IST|Sakshi

న్యూఢిల్లీ : తెలంగాణ కల సాకారం అవటంతో హస్తినలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు హడావుడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు ఆమె నివాసానికి టీ.కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్, మంత్రి గీతారెడ్డి విడివిడిగా సోనియాతో భేటీ అయ్యి కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్తో తెలంగాణ ప్రాంత నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వద్దని విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సోనియా గాంధీని ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక శుక్రవారం సమావేశమైన కాంగ్రెస్ కోర్ కమిటీలో కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపైనే చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే టీఆర్ఎఓస్

>
మరిన్ని వార్తలు