సచివాలయంలో స్వల్ప ఉద్రిక్తం

31 Aug, 2013 14:31 IST|Sakshi

సచివాలయంలో శనివారం స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ఉద్యోగులు సచివాలయంలో పోటాపోటీ ర్యాలీలు నిర్వహించారు. కాగా ఆ సమయంలో రెండు ప్రాంతాల ఉద్యోగులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆ రెండు ర్యాలీలు ఒకే మార్గంలో ఎదురెదురుగా వచ్చాయి.

 

దాంతో ఆ రెండు ప్రాంతాల వారు నినాదాలు మరింత పెంచడంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు ప్రాంత ఉద్యోగులను శాంతపరిచారు. ఆ సమయంలో పోలీసులకు, ఉద్యోగులుకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది.

మరిన్ని వార్తలు